byసూర్య | Wed, Apr 17, 2024, 01:27 PM
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం కొండమల్లెపల్లి పట్టణంలోని కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ బాలు నాయక్ మాట్లాడుతూ.. సీతారాముల చల్లని చూపు మీ ఇంట ప్రసరించాలని ఆయన అన్నారు.