byసూర్య | Wed, Apr 17, 2024, 01:20 PM
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని శ్రీ అభయఅంజనేయస్వామి ఆలయంతోపాటుగా శివాలయంలో బుధవారం ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్ప దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, భక్తులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.