byసూర్య | Wed, Apr 17, 2024, 11:07 AM
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జహీరాబాద్ పార్లమెంటు కు సంబంధించిన నామినేషన్ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బుధవారం పరిశీలించారు. నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేయాల్సిన బందోబస్తు గురించి పోలీసు అధికారులతో చర్చించారు. అభ్యర్థులకు సూచనలు ఇచ్చేందుకు హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.