byసూర్య | Tue, Apr 16, 2024, 11:27 AM
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలిక పరిధిలోని పర్దీపూర్ గ్రామానికి చెందిన అర్చకుడు చక్రవర్తి 35 వేల బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని రాసి తన రామ భక్తిని చాటుకున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న రాములోరి కళ్యాణానికి బియ్యపు గింజలను పంపుతున్నట్లు మంగళవారం ఆయన తెలిపారు.