byసూర్య | Tue, Apr 16, 2024, 10:38 AM
రూ. 2 లక్షల రైతు రుణమాఫీ పథకాన్ని తీసుకొస్తామని అప్పటివరకు రైతులను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం బ్యాంకులను కోరారు. సీఎం, డిప్యూటీ సీఎం, అధికారులతో చర్చించి రుణమాఫీ చేస్తామన్నారు. అటు రైతుభరోసా సాయం కోసం ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించి, సొమ్ము అందిస్తామన్నారు. ఇక వానాకాలం సీజన్ కు సంబంధించి పంటలకు అవసరమైన విత్తన సరఫరాలో లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.