రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

byసూర్య | Mon, Apr 15, 2024, 10:50 PM

తెలంగాణలో ఓవైపు లోక్‌సభ ఎన్నికల హడావుడి నడుస్తుంటే.. మరోవైపు పొలాలన్ని ఎండిపోయి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్న వేళ రైతాంగానికి రైతు సర్కారు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న రైతు భరోసా, పంటల భీమాతో పాటు రుణమాఫీ పథకం విధివిధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారని తుమ్మల పేర్కొన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు భరోసా, పంటల భీమా అమలుకు కవాల్సిన నిధుల సమీకరణపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు వ్యవసాయ పరపతి సంఘాలు, బ్యాంకుల నుంచి ఎవరైతే రైతులు పంట రుణాలు తీసుకున్నారో వారందరి నుంచి డబ్బు రికవరీ కోసం ఇబ్బందులు పెట్టకూడదంటూ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.


వచ్చేది వర్షాకాలం కావడంతో.. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలని వ్యవసాయ అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు. మార్క్‌ఫెడ్‌ కేంద్రంగా రైతులకు తీసుకొచ్చే అన్ని రకాల పంటల కొనుగోలు సక్రమంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్ యార్డులకు తీసుకువచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM