byసూర్య | Mon, Apr 15, 2024, 03:46 PM
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ గంగమ్మ తల్లి జాతరకు సోమవారం ఎమ్మెల్యే వేముల వీరేశం హజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కట్టంగూర్ మండల యంపిపి జెల్లా ముత్తిలింగం, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ, మండల పార్టీ అధ్యక్షులు పెద్ది సుక్కయ్య, తదితరులు పాల్గొన్నారు.