byసూర్య | Mon, Apr 15, 2024, 03:43 PM
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ లో సోమవారం ఎమ్మెల్యే వేముల వీరేశం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏప్రిల్ 17 (బుధవారం) నియెజకవర్గ బూతు స్థాయి సమావేశం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ సమావేశానికి హాజరైతునట్లుగా తెలిపారు. శ్యామల గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.