byసూర్య | Mon, Apr 15, 2024, 03:38 PM
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆదివారం తెల్లవారుజామున డిండి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం నమ్మదగిన సమాచారం మేరకు చెరుకుపల్లి స్టేజీ సమీపంలో ఓ వాహనంలో తరలిస్తున్న 20 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకుని డ్రైవర్, ఓనర్ లపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్టు తెలిపారు. అక్రమ రేషన్ బియ్యం దందా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.