byసూర్య | Mon, Apr 15, 2024, 03:49 PM
బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కనగల్ మండలంలోని చర్ల గౌరారం గ్రామంలో జరిగింది. ఏఎస్ఐ నరసింహారెడ్డి వివరాల ప్రకారం.. గ్రామంలో ఓ బావిలో వ్యక్తి మృతదేహం తేలుతుండగా గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. మండలంలోని జీ. ఎడవల్లి గ్రామానికి చెందిన తలారి వెంకన్నగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్నీ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.