byసూర్య | Sat, Apr 13, 2024, 10:12 AM
వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలపై ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన పట్టణానికి చేరుకొని దొంగతనం జరిగిన దుకాణదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నగదు, విలువైన సామగ్రిని దుకాణాల్లో ఉంచొద్దని ఆయన సూచించారు. అనంతరం అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి నుంచి దొంగతనాల కేసులపై ఆరా తీశారు.