byసూర్య | Sat, Apr 13, 2024, 10:28 AM
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికలలో జనంపల్లి అనిరుధెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా శుక్రవారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు యాదగిరి బైరంపల్లి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హాజరై పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.