byసూర్య | Sat, Apr 13, 2024, 10:41 AM
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామంలో శుక్రవారం శ్రీ సీతారామాంజనేయ, లక్ష్మణ, కుమార స్వాముల విగ్రహ ప్రతిష్టాపన, ఉత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.