byసూర్య | Fri, Apr 12, 2024, 12:25 PM
శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈనెల 17వ తేదీనా ఉప్పుగూడ పరిసరాలలో శ్రీరామ శోభాయాత్రను నిర్వహించినట్లు శ్రీరామసేన నిర్వాహకులు తాడెం శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 17వ తేదీన ఉప్పుగూడ, శివాజీ నగర్, అరుంధతి కాలనీ, రక్షాపురం, సాయిబాబా నగర్లలో శోభాయాత్ర వైభవంగా కొనసాగుతుందన్నారు. భక్తులు తరలి రావాలని కోరారు.