byసూర్య | Fri, Apr 12, 2024, 02:04 PM
మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి షాద్ నగర్ నియోజకవర్గం నుండి శుక్రవారం బిజెపి ముఖ్య నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ రంగా రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్, పాలమూర్ విష్ణువర్ధన్ రెడ్డి, వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.