byసూర్య | Fri, Apr 12, 2024, 12:24 PM
పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఈనెల 13వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు జిఎంఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి హాజరవుతారని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశానికి సకాలంలో హాజరుకావాలని కోరారు.