byసూర్య | Thu, Apr 11, 2024, 10:54 PM
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా సహాయక కేంద్రాన్ని ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు పాలేరు నియోజకవర్గ ఆర్ఓ రాజేశ్వరి తెలిపారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఈ కేంద్రంలో ప్రజలకు ఓటరు జాబితాలో పేరు, ఏ పోలింగ్ స్టేషన్ లో ఓటు ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి, నామినేషన్ పత్రాల పూరింపులో సలహాలు, సందేహాల నివృత్తి చేయబడుతుందని తెలిపారు.