మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

byసూర్య | Wed, Oct 23, 2024, 07:53 PM

మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో బుధవారం బీజేపీ నాయకులు పర్యటించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) బుధవారం ఉదయం రామంతాపూర్ మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించి, వారితో మాట్లాడారు.సాయంత్రం చైతన్యపురిలోని మూసీ నిర్వాసితులను కలిసి వారి సమస్యలు విన్నారు. అనంతరం వారితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ చేసిన పోరాటం వల్లే అధికారులు ఇప్పటి వరకు మమ్మల్ని ఖాళీ చేయించే దైర్యం చేయలేదు..అయినప్పటికీ ఆందోళనగానే ఉందన్నారు. మూసీ సుందరీకరణ కంటే మా ఇళ్లే మాకు ముఖ్యం. ఇక్కడ మేము కట్టుకున్న మంచి ఇళ్లను వదిలి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మేము వెళ్లలేము అని తేల్చి చెప్పారు. ప్రభుత్వం పెట్టే టెన్షన్ కి మా ఆరోగ్యాలు పాడవుతున్నాయి.. మా ప్రాణాలు పోయినా ఇక్కడి ఇళ్ల నుండి కదిలేది లేదని ఈటల దగ్గర వాపోయారు.


 


 


Latest News
 

రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా చేపట్టడం లేదు : గాదరి కిశోర్‌ Wed, Oct 23, 2024, 08:19 PM
మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ Wed, Oct 23, 2024, 07:53 PM
మహారాష్ట్ర అభ్యర్థికి బీఫామ్ అందజేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ Wed, Oct 23, 2024, 07:46 PM
చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేసిన కార్పొరేటర్ Wed, Oct 23, 2024, 07:45 PM
గవర్నర్ పర్యటన పై మంత్రి ఉత్తమ్ హర్షం Wed, Oct 23, 2024, 07:43 PM