byసూర్య | Thu, Apr 11, 2024, 10:54 PM
ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని బోడేపూడి భవనంలో గురువారం మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోతినేని సుదర్శన్ పాల్గొని జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు చేసిన సేవలను గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.