రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ ప్లస్ అదానీ

byసూర్య | Wed, Oct 23, 2024, 04:08 PM

రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ, అదానీ అని కేటీఆర్‌ విమర్శించారు. అందుకే వాళ్లిద్దరికీ కావాల్సిన పనులను చక్కబెడుతూ వారి చల్లని చూపు తనపై ఉండేలా చూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని ఆదేశానుసారమే రేవంత్ నడుచుకుంటున్నారని ఆరోపించారు. బడే భాయ్ ఆజ్ఞలను ముఖ్యమంత్రి తూచా తప్పకుండా పాటిస్తున్నారని, అదాని సంతృప్తి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.అదానికి మేలు చేసేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ధ్వజమెత్తారు. అందుకే ముఖ్యమంత్రి దుర్మార్గాలపై బీజేపీ మౌనంగా ఉంటుందని ఆరోపించారు. మూసీ దిగువన రామన్నపేటలో అంబుజా సిమెంట్ ప్లాంట్ కోసం బూటకపు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Latest News
 

75% పూర్తైన ఎయిమ్స్ బీబీనగర్ నిర్మాణం.. ఫోటోలు షేర్ చేసిన కేంద్ర మంత్రి Wed, Oct 23, 2024, 06:55 PM
గంగారెడ్డి హత్యతో నాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే సంజయ్ Wed, Oct 23, 2024, 06:53 PM
గద్వాల: క్రమబద్ధీకరణ పేరుతో దోపిడీకి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ Wed, Oct 23, 2024, 06:50 PM
సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను చెప్పలేను: నాంపల్లి కోర్టులో కేటీఆర్ Wed, Oct 23, 2024, 06:50 PM
జాగృతి పోలీస్ కళా బృందంచే అమర వీర పోలీసుల స్మరణ ప్రదర్శన Wed, Oct 23, 2024, 06:46 PM