కొండా సురేఖ తరఫున రిప్లై దాఖలు చేసిన న్యాయవాది గుర్మీత్ సింగ్

byసూర్య | Wed, Oct 23, 2024, 04:00 PM

సినీ నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావాకు సంబంధించి మంత్రి కొండా సురేఖ నాంపల్లి ప్రత్యేక కోర్టులో రిప్లై ఫైల్ చేశారు. నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో నాగార్జునపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాగార్జున సహా సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు ఇదివరకే నమోదు చేసింది. ఈ క్రమంలో తాజాగా, మంత్రి రిప్లైని ఫైల్ చేశారు.మంత్రి తరఫున ప్రముఖ న్యాయవాది గుర్మీత్ సింగ్ కోర్టులో సమాధానాన్ని ఫైల్ చేశారు. అనంతరం కోర్టు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. నాగార్జునపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి. ఆమె వ్యాఖ్యలను టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు.


Latest News
 

రేవంత్ రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోదీ ప్లస్ అదానీ Wed, Oct 23, 2024, 04:08 PM
జీవన్ రెడ్డి వంటి నేతనే ఫిరాయింపులు పార్టీ వ్యతిరేకమని చెప్పారన్న కేటీఆర్ Wed, Oct 23, 2024, 04:06 PM
లీగల్ నోటీసులతో బెదిరించాలని చూస్తే భయపడేవారు లేరన్న సంజయ్ Wed, Oct 23, 2024, 04:03 PM
బిసి రాజ్యాధికార సమితి ఏర్పాటుకు సమరభేరి Wed, Oct 23, 2024, 04:01 PM
కొండా సురేఖ తరఫున రిప్లై దాఖలు చేసిన న్యాయవాది గుర్మీత్ సింగ్ Wed, Oct 23, 2024, 04:00 PM