byసూర్య | Fri, Mar 29, 2024, 08:32 PM
కామారెడ్డి బల్దియా రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి పై ఇటీవల పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేస్తూ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. దీంతో అవిశ్వాస పరీక్షను ఈ నెల 30న చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించడంతో ఆ దిశగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పదవిని దుర్వినియోగం చేస్తూ అక్రమాలు చేశారని ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.