byసూర్య | Fri, Mar 29, 2024, 08:30 PM
కామారెడ్డి పట్టణంలోని గొల్లవాడ కబరస్తాన్ కు కేపి రాజారెడ్డి జనసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆఖరి సఫారీకి ఘాడి (అంతిమ యాత్రకి ఉపయోగించే రథం) ను కబరస్తాన్ నిర్వాహకులకు ట్రస్ట్ సభ్యులు శుక్రవారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కబరస్తాన్ నిర్వాహకులు మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలోని పేద ముస్లింలకు ఈ వాహనం ఉపయోగపడుతుందని, లక్షల విలువ చేసే వాహనాన్ని ఎలాంటి షరతులు లేకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఇవ్వడం సంతోషకరం అన్నారు.