తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ..

byసూర్య | Sun, Apr 28, 2024, 08:59 PM

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర విషయం.. తొలిసారిగా ఓ తమిళపార్టీ పోటీచేస్తోంది. తమిళనాడు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విడుతలై చిరుతైగల్‌ కట్చి (వీసీకే) పార్టీ తరఫున హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులుగా జె.పద్మజ, పగిడిపల్లి శ్యామ్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్‌ లోక్‌సభకు పోటీచేస్తున్న జె.పద్మజ ముషీరాబాద్‌లో ఉంటుండగా.. సికింద్రాబాద్‌ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న పగిడిపల్లి శ్యామ్‌ కుత్బుల్లాపూర్‌లోని సూరారం కాలనీలో ఉంటున్నారు.


తమిళనాడులో బహుజనులు, దళితుల హక్కుల కోసం విడుతలై చిరుతైగల్‌ కట్చి నాలుగు దశాబ్దాలుగా పోరాడుతోంది. గతంలో ఆ పార్టీకి దళిత్‌ పాంథర్స్‌ ఇండియాగా పేరుంది. వీసీకే పార్టీ అధ్యక్షుడిగా తిరుమావలన్‌ కొనసాగుతున్నారు. ఇక తమిళనాడులో డీఎంకే పార్టీతో వీసీకే పొత్తు కుదుర్చుకుంది. పొత్తులో భాగంగా డీఎంకే అగ్రనేతలు వీసీకే పార్టీకి రెండు లోక్‌సభ స్థానాలను కేటాయించారు. మరోవైపు బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలిపినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్‌ తెలిపారు.మొత్తానికి తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది.


Latest News
 

పోలింగ్ సరళి పరిశీలించిన ఎంపీ అభ్యర్థి Mon, May 13, 2024, 02:38 PM
45. 15 శాతం పోలింగ్ నమోదు Mon, May 13, 2024, 02:37 PM
ఓటు వేసిన ట్రాన్స్ జెండర్ Mon, May 13, 2024, 02:34 PM
పోలింగ్ సరళిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే Mon, May 13, 2024, 02:30 PM
వనపర్తి-పెబ్బేరు బీటీ రోడ్డు విస్తరణ చేపట్టాలి Mon, May 13, 2024, 02:26 PM