byసూర్య | Fri, Mar 29, 2024, 08:29 PM
యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని, ఎల్లారెడ్డి సొసైటీ సిఈఓ విశ్వనాథం అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు సొసైటి వారి అధ్వర్యంలో లక్ష్మాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.