byసూర్య | Fri, Mar 29, 2024, 08:15 PM
ఆదర్శ వివాహాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని, అందుకే యువత ఆడంబరాలకు పోకుండా ఆదర్శంగా చేసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని బివికే జనరల్ మేనేజర్ వై. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
ఖమ్మం సుందరయ్య భవనంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేగువేరా ఆదర్శ వివాహ వేదిక ద్వారా షేక్ షరీఫ్, షేక్ ఇస్రాత్ లకు 61వ ఆదర్శ వివాహం చేశారు. శ్రీనివాసరావు ఆచార్యులుగా వ్యవహరిస్తూ ఈ వివాహాన్ని జరిపించారు.