byసూర్య | Fri, Mar 29, 2024, 08:13 PM
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కేతినేని హరీష్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు.