byసూర్య | Fri, Mar 29, 2024, 08:14 PM
ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న లోకసభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం పనుల పురోగతిని సీపీ సునీల్ దత్ తో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఏడు సెగ్మెంట్లకు కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూంలు, కేంద్రీకృత రిసెప్షన్ కేంద్రం ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.