byసూర్య | Fri, Mar 29, 2024, 08:08 PM
యేసు క్రీస్తు లోకరక్షకుడు అని, పాపపరిహారార్థమై యేసు క్రీస్తు భూలోకానికి వచ్చాడని ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి అన్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ గుట్టమీద గల ఆర్సీఎం చర్చిలో ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఏసుప్రభు దయతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరారు. అనంతరం యేసు క్రీస్తు సిలువ మార్గం యాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.