ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు.. కదం తొక్కుదాం: కేటీఆర్

byసూర్య | Fri, Mar 29, 2024, 07:57 PM

తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీకి కష్టాలు కొనసాగుతున్నాయి. నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వదిలేసి కాంగ్రెస్‌లోకి వెళుతుండటం ఆందోళన కలిగిస్తోంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో వలసలు కారు పార్టీని కష్టాల్లోకి నెట్టేస్తోంది. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. తండ్రి కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజా పరిణామాలపై స్పందించారు.. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పార్టీ కేడర్‌లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.


'శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కేసీఆర్. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారు' అన్నారు.


'ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCR గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. నికార్సైన కొత్త తరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం' అంటూ కేటీఆర్ స్పందించారు.


Latest News
 

బీజేపీ అభ్యర్థిని గెలిపించండి: నున్నా Sun, Apr 28, 2024, 12:03 PM
తనను గెలిపిస్తే ప్రజల సేవకుడిగా మిగిలిపోతా Sun, Apr 28, 2024, 12:03 PM
గత పాలకులు అన్ని రంగాలను భ్రష్టు పట్టించింది: తుమ్మల Sun, Apr 28, 2024, 12:03 PM
భగభగలాడుతున్న భానుడి ప్రతాపానికి రోడ్లన్నీ నిర్మానుషం Sun, Apr 28, 2024, 12:02 PM
గత పాలకుల చెంప చెల్లుమనిపించారు: పొంగులేటి Sun, Apr 28, 2024, 12:01 PM