కాటేదాన్‌లో దారుణం.. మహిళ తలపై బండరాయితో మోది హత్య

byసూర్య | Fri, Mar 29, 2024, 07:50 PM

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలోని కాటేదాన్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని మహిళ హత్యకు గురయ్యింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద మహిళ తలపై దుండగులు బండరాయితో మోదీ హతమార్చారు. బాధితురాలిపై అత్యాచారం చేసిన తర్వాత ఘాతానికి పాల్పడినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న మైలార్‌దేవ్ పల్లి పోలీసులు..మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. క్లూస్ టీం, డాగ్ స్కాట్ బృందాలు రంగంలోకి దిగి ఆధారాలు కోసం గాలిస్తున్నాయి.


హత్యాచారాని గురైన మహిళ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఘటనా స్థలిలో లభించిన ఆధారాలను బట్టి ఆమెను సమీరాఖాన్‌గా గుర్తించారు. కాగా, ఆమె ప్రియుడే సమీరాను హత్య చేసి ఉండొచ్చని పోలీసుల ప్రాథమికంగా నిర్దారించారు. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అలాగే, పోస్ట్‌మార్టం తర్వాతే ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అనేది తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే హత్య ఎలా జరిగింది? అనేది స్పష్టత వస్తుంది.


‘మహిళను తలపై బండరాళ్లతో దాడిచేయడంతో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.. హత్యకు ముందు ఆమె లైంగిక వేధింపులకు గురైందా అనే విషయంతో సహా అన్ని కోణాల్లోనూ మేము దర్యాప్తు చేస్తున్నాం’ అని పోలీసులు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశామని చెప్పారు. అనుమానితుల గురించి తెలుసుకోడానికి ఘటనా స్థలికి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లోని సీసీటీవీలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. అక్కడే ఈ హత్య జరిగిందా? లేక మరే ప్రాంతంలో హత్య చేసి శవాన్ని ఇక్కడ పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తు్నట్టు వివరించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు చెప్పారు.


Latest News
 

బీజేపీ అభ్యర్థిని గెలిపించండి: నున్నా Sun, Apr 28, 2024, 12:03 PM
తనను గెలిపిస్తే ప్రజల సేవకుడిగా మిగిలిపోతా Sun, Apr 28, 2024, 12:03 PM
గత పాలకులు అన్ని రంగాలను భ్రష్టు పట్టించింది: తుమ్మల Sun, Apr 28, 2024, 12:03 PM
భగభగలాడుతున్న భానుడి ప్రతాపానికి రోడ్లన్నీ నిర్మానుషం Sun, Apr 28, 2024, 12:02 PM
గత పాలకుల చెంప చెల్లుమనిపించారు: పొంగులేటి Sun, Apr 28, 2024, 12:01 PM