బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య?

byసూర్య | Fri, Mar 29, 2024, 03:11 PM

వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యను ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ తాజా రాజకీయాలు నేపథ్యంలో తిరిగి రాజయ్య పేరు తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్గన్పూర్ సెట్టింగ్ ఎమ్మెల్యే స్థానం అయినప్పటికీ టికెట్ ఇవ్వకపోవడంతో అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. గత నెల మూడో తేదీన రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.కాంగ్రెస్ నేతలతోనూ భేటీ అయ్యారు. అయినప్పటికీ ఇంకా కాంగ్రెస్‌లో చేరలేదు. కావ్యతో పాటు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం పార్టీ మారుతుండటంతో తిరిగి గులాబీ పార్టీలోకి వస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో రాజయ్య కేసీఆర్తో భేటీ అవుతున్నట్లు సమాచారం. వరంగల్ పార్లమెంట్ పరిధిలో తాజా రాజకీయాలు చర్చించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే బాబు మోహన్, పెద్ది స్వప్న, తదితర పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ తాటికొండ వైపు ముగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.


 


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM