byసూర్య | Fri, Mar 29, 2024, 03:42 PM
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు దుబ్బాక ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని శుక్రవారం ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యువసేన సభ్యులు పాల్గొన్నారు