byసూర్య | Fri, Mar 29, 2024, 02:52 PM
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ నాయక్, యూత్ అధ్యక్షులు గణేష్ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జువ్వాడి గ్రామ కమిటీ నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా భుమేష్, ఉపాధ్యక్షులు భానుచందర్, ప్రధాన కార్యదర్శి సాయిలు, కార్యదర్శి స్వామి, సాయిలు, కోశాధికారి గోపాల్ రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులు గోవర్ధన్ యూత్ అధ్యక్షులు మహేష్, ఉపాధ్యక్షులు గైని రంజిత్ ఎన్నికయ్యారు.