byసూర్య | Fri, Mar 29, 2024, 02:50 PM
రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన టెట్ పై ఉపాధ్యాయుల్లో పలు సందేహాలు నెలకొన్నాయని దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంగం శ్రీశైలం అన్నారు. గతంలో విడుదల చేసిన అన్ని నోటిఫికేషన్లలో 2010, ఆగస్టు 23కు ముందు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అర్హత మినహాయించబడిందని, కానీ ప్రస్తుత నోటిఫికేషన్లో ఆ నిబంధనను విద్యాశాఖ తొలగించింది. విద్యాశాఖ అధికారులే స్పందించి టెట్ పై స్పష్టత ఇవ్వాలని కోరారు.