byసూర్య | Fri, Mar 29, 2024, 02:47 PM
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన దేవల సంజయ్ అదృశ్యమైనట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సంజయ్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. సంజయ్ ఆచూకీ లభించకపోవడంతో అతని భార్య శ్రీలత పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. ఇల్లు కట్టడానికి చేసిన అప్పులు పెరిగినట్లు తెలిసింది.