byసూర్య | Fri, Mar 29, 2024, 02:41 PM
రుద్రూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన 50 మంది కార్యకర్తలు గురువారం పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు ఇన్ చార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు అరుణతార, ఎండల లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ గార్గే, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.