byసూర్య | Fri, Mar 29, 2024, 01:41 PM
మద్నూర్ మహాజన్ బాలాజీ అనే వ్యక్తి ఇంట్లో మార్చి 26న సాయంత్రం 8 గంటలకు దొంగతనం జరిగింది. 15 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల బంగారు బిస్కెట్, 16000 నగదు ఎత్తుకెళ్లారని మద్నూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మద్నూర్ గ్రామానికి చెందిన ఉప్పరివార్ శ్రీనును పోలీసులు పట్టుకొని ఈ కేసులో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు మద్నూర్ పోలీసులు తెలిపారు.