byసూర్య | Fri, Mar 29, 2024, 01:38 PM
గద్వాల బార్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎంపికైన అయిజ మండలం పర్దిపూర్ గ్రామానికి చెందిన సురేష్ గౌడ్ కు శుక్రవారం అయిజ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అభినందన సభను ఏర్పాటు చేశారు. అసోసియేషన్ కు చేసిన సేవలను గుర్తించి ఏకంగా కార్యదర్శి పదవిని అప్పజెప్పారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి, నాయకులు సాంబశివుడు, పాండురంగ, కృష్ణారెడ్డి, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.