byసూర్య | Fri, Mar 29, 2024, 01:37 PM
ప్రభుత్వాలు నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని డిఈడి బిఈడి నిరుద్యోగుల సంఘం నారాయణపేట జిల్లా నాయకులు ప్రభాకర్ అన్నారు. టెట్ పరీక్ష రుసుము గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు రూపాయల నుండి మూడు వందలకు పెంచిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా వెయ్యి రూపాయలకు పెంచిందని అన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని పరీక్ష ఫీజును తగ్గించాలన్నారు.