byసూర్య | Fri, Mar 29, 2024, 01:37 PM
లోక్సభ ఎన్నికల్లో పోటీపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పోటీ చేస్తున్న దక్షిణ చెన్నై నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. డబ్బులు లేకనే ఐదుసార్లు పోటీ చేసినా ఓడిపోయానని చెప్పారు. కానీ, ఈసారి అలా ఉండదన్నారు. ఆరోసారి గెలిచి మోదీకి గిఫ్ట్ ఇస్తానని అన్నారు.