byసూర్య | Fri, Mar 29, 2024, 12:54 PM
పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణపై పోలింగ్ అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కొమురంభీం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లతో కలిసి పాల్గొని మాట్లాడారు. విధులు నిర్వహించే పీవో, ఏపీవో, ఇతర పోలింగ్ సిబ్బందికి ప్రతి అంశంపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించాలని సూచించారు.