byసూర్య | Fri, Mar 29, 2024, 12:54 PM
ఓ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన యువకుడిని గురువారం కొత్తకోట పోలీసులు జైలుకు పంపించారు. ఎస్ఐ మంజునాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. నాటవెల్లికి చెందిన ఓ బాలికను వనపర్తి జిల్లా & మండలం సవాయిగూడెం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. కాగా బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కోర్టులో హాజరు పర్చగా జడ్జి 14రోజుల రిమాండ్ విధించారు.