byసూర్య | Fri, Mar 29, 2024, 12:53 PM
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అచ్చంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామం సమీపంలో శుక్రవారం పర్వతాలు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో పర్వతాలు కుడికాలు విరగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది పైలెట్ పాండు, ఈఎంటి నగేష్ ప్రథమ చికిత్స చేసి కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు.