byసూర్య | Fri, Mar 29, 2024, 12:51 PM
వనపర్తి జిల్లా కేంద్రంలోని బసవన్నగడ్డ మదినా మసీదులో కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు పజిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో గురువారం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సహోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర మాసంగా జరుపుకునే రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.