సీఎం రేవంత్ తో ముగిసిన కేకే భేటీ

byసూర్య | Fri, Mar 29, 2024, 12:07 PM

సీఎం రేవంత్ రెడ్డితో రాజ్యసభ సభ్యుడు కె.కేశరావు భేటీ ముగిసింది. కాంగ్రెస్‌లో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించిన కేకే శుక్రవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వచ్చారు.  ఈ సందర్భంగా చేరికతో పాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జాయినింగ్ టైమ్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. కేకేతో పాటు ఆయన కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు.
అయితే బీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు(కేకే) త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నేడు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. రేవంత్ తో సమావేశమై పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా కేకే కూతురు హైదరాబాద్ బేయర్ గద్వాల విజయ కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. కాగా గురువారం కేకే మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయి కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు తేల్చి చెప్పారు.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM