byసూర్య | Fri, Mar 29, 2024, 11:42 AM
రంగారెడ్డి జిల్లా కాటేదాన్లో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్లో గుర్తుతెలియని దుండగుడు మహిళ తలపై రాయితో మోది హత్య చేశాడు.
శుక్రవారం తెల్లవారుజామున మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.