byసూర్య | Fri, Mar 29, 2024, 11:41 AM
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటంపేటలో అల్లుడిని చంపిన మామను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు పంపారు. సీఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 22న బండరాళ్ల విషయంలో జరిగిన గొడవకు సంబంధించి పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుతుండగా మామ ఎల్లయ్య ఒక్కసారిగా అల్లుడు రాజుపై కర్ర, బండరాయితో దాడి చేయడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. కేసును ఛేదించిన ఎస్ఐ యాదయ్య, సిబ్బందిని సీఐ అభినందించారు.