byసూర్య | Thu, Mar 28, 2024, 04:26 PM
ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే ప్రయత్నం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అట్టి ఆలోచనను విరమించుకోవాలని ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు బందెల వెంకయ్య డిమాండ్ చేశారు.
గురువారం తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు రాయల వెంకటనారాయణ భవనంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఉపాధి కూలీలు పని చేసినా ఇంతవరకు బిల్లులు రాలేదని, వెంటనే బిల్లులు మంజూరు చేయాలన్నారు.