byసూర్య | Thu, Mar 28, 2024, 04:27 PM
కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిలో గాయపడి చికిత్స చేయించుకోని సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మున్సిపల్ కౌన్సిలర్ ఎస్కే చాంద్ పాషా ను గురువారం మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరామర్శించారు.
ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు ఉమామహేశ్వరరావు, దొడ్డ శంకరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, తదితరులు పాల్గొన్నారు.